అడవుల్లో తిరగాల్సిన గుడ్డేలుగు సైన్యంలో చేరింది. ట్రైనింగ్ తీసుకుని సోల్జర్గా మారింది. యుద్ధంలో కూడా పార్టిసిపేట్ చేసింది. రెండో ప్రపంచ యుద్ధమప్పుడు పోలాండ్ దేశ ఆర్మీలో పనిచేసింది. ఆ గుడ్డేలుగు చేసిన సేవలకు గాను, చాలా చోట్ల దాని విగ్రహాలు వెలిశాయి. గుడ్డేలుగు ఏంటి? సైన్యంలో పని చేయడం ఏంటి అనిపిస్తుంది కదా! నిజంగా చాలా గ్రేట్ అది.
జంతువులు, పక్షులు మనుషులతో సావాసం చేయడం ఎప్పట్నించో చూస్తున్నదే. పిల్లి, కోతి, కుక్క, మేక, గేదె, గుర్రం, చిలుక, పావురం, కోడి వంటి చాలా జంతువులు మనుషులతోనే కలిసి జీవిస్తున్నాయి. నిజానికి అవి మన మీద డిపెండ్ అయ్యి బతుకుతుంటే, మనిషేమో వాటి మీద డిపెండ్ అయ్యి బతుకు ఈడుస్తున్నాడన్న సంగతి తెలిసిందే. అయితే దాదాపు డెబ్భై ఏళ్ల క్రితం ఒక గుడ్డేలుగు కూడా మనుషులతో ఫ్రెండ్షిప్ చేసింది. అది కూడా ఆర్మీలో ఉండే సైనికులతో. మామూలుగా ఏ జంతువైనా మనుషులతో కలిసి ఉంటే, వాళ్లు చేసేవన్నీ గమనించి ఇమిటేట్ చేస్తుంటుంది. సోల్జర్స్ అంటే వార్ కోసం రెడీ అవుతుంటారు. కంటిన్యూస్గా కసరత్తులు చేస్తుంటారు. అందుకని వాళ్లతో ఫ్రెండ్షిప్ చేసి గుడ్డేలుగు కూడా సోల్జర్గా మారిపోయింది కాబోలు అనుకుంటున్నారా! అవును, అక్షరాల అదే నిజం. అనుకోని ఇన్సిడెంట్స్ వల్ల అనాథగా మారిన ఒక సిరియన్ బ్రౌన్ బేబీ బేర్ స్టోరీ ఇది.
అసలేం జరిగిందంటే...
అది 1942. రెండో ప్రపంచయుద్ధం నాటి కాలం. ఇరాన్లోని హమదాన్ రైల్రోడ్ స్టేషన్ దగ్గర్లో కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో ఒక గుడ్డేలుగు చనిపోయింది. అక్కడ దాని పిల్ల గుడ్డేలుగు కూడా ఉంది. తల్లి ప్రాణాలు పోయాక పిల్ల గుడ్డేలుగు అనాథ అయ్యింది. 1942, ఏప్రిల్ 8న ఇరానియన్ పిల్లాడు ఆ పిల్ల గుడ్డేలుగుతో ఆడుకోవడం పోలెండ్ సోల్జర్స్ చూశారు. పిల్లాడు ఏం చెబితే ఆ గుడ్డేలుగు అదే చేస్తుంటుంది. అదలా చేయడం చూసి వాళ్లు ఆశ్చర్యపోయారు. పిల్లాడికి చెప్పి, ఆ బేబీ బేర్ని తమతో తీసుకెళ్లిపోయాడు. ఆ తర్వాత వాళ్ల జనరల్ మనవరాలు ఇరేనా కొన్ని రోజులు ఆ బేబీ బేర్ని పెంచుకుంది. 1942, ఆగస్ట్లో ఇరేనా సెకండ్ ట్రాన్స్పోర్ట్ కాంబ్ యూనిట్కి ఆ గుడ్డేలుగుని డొనేట్ చేసింది. తర్వాతి కాలంలో ఈ యూనిట్ 27 ఆర్టిలరీ యూనిట్గా పాపులర్ అయింది. అక్కడి సోల్జర్స్ దానికి ‘వాయ్టెక్’ అని పేరు పెట్టారు. వాయ్టెక్ అంటే వాళ్ల భాషలో ‘హ్యాపీ సోల్జర్’ అని అర్థం. కొద్దిరోజుల్లోనే వాయ్టెక్ పోలాండ్ సోల్జర్స్కి మంచి ఫ్రెండ్ అయ్యింది. మొదట్లో దానికి బీర్ బాటిల్తో పాలు పట్టేవాళ్లు సోల్జర్స్. తేనె కూడా ఇచ్చేవాళ్లు. అప్పుడప్పుడూ వోడ్కా కూడా తాగించేవాళ్లు. అయితే బేబీ బేర్ పాలు, తేనె కంటే బీర్, వోడ్కాలు తాగడాన్నే ఎక్కువ ఇష్టపడేదట. పాలను కూడా వొడ్కా బాటిల్లో పోసి ఇస్తేనే తాగేదట. బాటిల్ ఖాళీ అయిపోతే, అందులో ఇంకా ఏమైనా మిగిలి ఉందేమోనని బాటిల్ లోపలికి చూసేది వాయ్టెక్. సోల్జర్స్ కూడా దాన్ని చిన్నపిల్లని చూసుకున్నట్టు చూసుకునేవాళ్లు. సిగరెట్ తాగి, పొగ వాళ్లమీదకు ఊదడం, కుస్తీ పట్టడం వంటివి ఇమిటేట్ చేసేది వాయ్టెక్. ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్లు తాగడం కూడా వాయ్టెక్కి చాలా ఇష్టమట. గుడ్డేలుగు లైఫ్ ఆరెంజ్లు విసిరేస్తూ గ్రెనేడ్ విసరడాన్ని ప్రాక్టీస్ చేయించేవారట. గుడిసెల్లోకి వెళ్లి తనంతట తానుగా స్నానం చేయడం నేర్చుకుందట. మాంటే కాస్సినోలో యుద్ధం జరిగేటప్పుడు గన్స్ని లోడ్ చేయడానికి కావాల్సిన మందుగుండు సామాగ్రి పట్టుకుని ఫ్రంట్ లైన్ వారియర్గా నిలుచునేది వాయ్టెక్. సోల్జర్స్తో కలిసి నిద్రపోయేది. వార్ వెపన్స్ ఉన్న బాక్స్లను ఈజీగా మోసేది. సోల్జర్స్ చేసే ప్రతి పనినీ, వాయ్టెక్ కూడా చేసేది. ఒకసారి బ్రిటిష్ సోల్జర్స్తో కలిసి, ఈ 22 యూనిట్ సోల్జర్స్ యుద్ధం చేయాల్సివచ్చింది. అందుకోసం, ఈ సైనికులంతా బ్రిటిష్ ట్రాన్స్పోర్ట్ షిప్లో జర్నీ చేయాల్సి వచ్చింది. కానీ, ఈజిప్ట్ పోర్ట్లో అక్కడి ఆఫీసర్స్ వాయ్టెక్ని లోపలికి రానివ్వలేదు. కానీ, సోల్జర్స్కి వాయ్టెక్ని వదిలి వెళ్లడం ఇష్టంలేక, పోలెండ్ ఆర్మీలో లీస్ట్ ర్యాంక్ సోల్జర్గా రిజిస్టర్ చేశారు. అలా వాయ్టెక్ పోలెండ్ ఆర్మీలో అఫీషియల్ సోల్జర్ అయ్యిందన్నమాట.
యుద్ధ రంగంలో...
1944, మాంటే కాస్సినోలో జరిగిన యుద్ధంలో ఈ సైన్యం పాల్గొంది. ఈ యుద్ధంలో వాయ్టెక్ సోల్జర్స్కి ఎంతో సాయం చేసింది. దాదాపు నలభై ఐదు కేజీల మందు గుండు సామాన్లు ఉన్న బాక్స్ను ఈజీగా పట్టుకెళ్లి సైనికులకు ఇచ్చేది. పెద్ద పెద్ద రాకెట్లను కూడా మోసుకెళ్లేది. నిజానికి వీటిని ట్రక్లో పెట్టి వార్ జరిగే చోటుకి తీసుకెళ్లేవాళ్లు. కానీ, వాయ్టెక్ వాటిని మోసుకెళ్లడం వల్ల సోల్జర్స్కి పని ఈజీ అయింది. మాంటే కాస్సినోలో 1944 , జనవరి 17 నుంచి మే 19 వరకూ అంటే దాదాపు మూడు నెలలు యుద్ధం జరిగింది. ఈ వార్లో వాయ్టెక్ చేసిన సాయానికి గాను, అప్పటి వరకు తక్కువ ర్యాంక్లో ఉన్న దాన్ని కార్పొరేట్ ట్రైనింగ్కు ప్రమోట్ చేశారు. దాంతో ఆ యూనిట్కి ఎంబ్లమ్గా వాయ్టెక్ ఫొటోను పెట్టుకున్నారు. 1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక, యూనిట్తో పాటు వాయ్టెక్ కూడా స్కాట్లాండ్కి వెళ్లింది. ఆ తర్వాత సోల్జర్స్ అంతా వెళ్లిపోయారు. దాంతో 1947, నవంబర్ 15న ఎడిన్ బరో జూకి పంపించారు. అప్పటిదాకా తనతో ఉన్న సోల్జర్స్ కనిపించక ఒంటరై పోయింది వాయ్టెక్. అప్పుడప్పుడూ సోల్జర్స్ దాన్ని చూసేందుకు ఆ జూకి వెళ్లేవాళ్లు. 1963, వాయ్టెక్కి పేగు పాడయింది. సిగరెట్లు మింగడం వల్లే అలా జరిగింది అంటారు. అదే సంవత్సరం డిసెంబర్లో 21 ఏళ్ల వాయ్టెక్ కన్నుమూసింది.
- పోలాండ్ ఆర్మీకి వాయ్టెక్ అందించిన సేవలకు గుర్తుగా లండన్లోని చాలా మ్యూజియాలు వాయ్టెక్ విగ్రహాలు పెట్టాయి.
- మాంటే కెస్సినో వార్ జరిగి డెబ్భై ఏళ్లు అయిన సందర్భంగా, 2014, మే 18న పోలాండ్లోని జోర్డాన్ పార్క్లో వాయ్టెక్ విగ్రహాన్ని పెట్టారు.
- 2015లో స్కాట్లాండ్లోని ఈడెన్ బర్గ్లో పోలాండ్ సోల్జర్తో వాయ్టెక్ ఉన్న విగ్రహాన్ని పెట్టారు. ఏప్రిల్ 26, 2012లో కూడా స్కాట్లాండ్లోని డున్స్ సిటీలో సోల్జర్ బేర్ విగ్రహాన్ని పెట్టారు.
- 1982లో ‘ది స్నోమ్యాన్’ అనే యానిమేషన్ డాక్యుమెంటరీ తీశారు. అది ఆస్కార్కి నామినేట్ అయ్యింది. ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ ప్రతి క్రిస్మస్కి బ్రిటిష్ టెలివిజన్లో టెలికాస్ట్ అవుతుంది.