మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో విషాదం చోటుచేసుకుంది. భర్త చనిపోవడంతో మనస్తాపానికి గురైన భార్య ఆత్మహత్య చేసుకుంది. మహేశ్వరి అనే మహిళకు అదే గ్రామానికి చెందిన రమేశ్ అనే వ్యక్తితో ఎనిమిదేళ్ల క్రితం పెళ్లైంది.వీళ్లకు ఇద్దరు పిల్లలున్నారు. అయితే 15 రోజుల క్రితం భర్త రమేశ్ మృతి చెందాడు. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపానికి గురైన భార్య మహేశ్వరి ఆదివారం ఉదయం స్థానిక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది.దీంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. స్థానికుల సమాచారంతో గజ ఈతగాళ్లు మహేశ్వరి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.