వేములవాడలో కుటుంబ కలహాలతో.. ఇద్దరు పిల్లలతో పాటు తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది ఓ మహిళ. జగిత్యాల జిల్లా దమ్మన్నపేటకి చెందిన మమత 15 రోజుల క్రితం తల్లిగారింటికి వెళ్లింది. తిరిగి వేములవాడకు వచ్చిన ఆమె.. తన ఇద్దరు పిల్లల గొంతు కోసి తానూ గొంతు కోసుకుంది. ఈ విషయం మమత తన భర్త రమేష్ కు చెప్పడంతో.. పిల్లలతో పాటు భార్యను వేములవాడ హాస్పిటల్ కు తరలించాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు.
మరిన్ని వార్తల కోసం