
నాలుగేళ్ల పాపపై అత్యాచారానికి తెగబడ్డాడు ఒక దుర్మార్గుడు. అప్పుడే చిన్ని చిన్ని మాటలు మాట్లాడుతూ.. బుడి బుడి అడుగులు వేస్తున్న చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు.. పోలీసులపై కాల్పులకు దిగటం ఉత్తరప్రదేశ్ లో కలకలం రేపింది. విచారణకు వచ్చిన అధికారులపై కాల్పులకు తెగబడటంతో ఆగ్రహించిన మహిళా పోలీస్.. ఏకంగా షూట్ చేసి పడేసింది.
లక్నోకు చెందిన కమల్ కిశోర్ అనే కామాంధుడు.. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి మదేగంజ్ ఏరియాలో ఒక చోట దాక్కున్నాడని సమాచారం అందుకున్నారు పోలీసులు. నిందితుడి కోసం వెళ్లిన పోలీసులు.. అతడు ఫైర్ ఆన్ చేయడంతో షాక్ గురయ్యారు. టీమ్ ను లీడ్ చేస్తున్న మహిళా ఎస్సై ధైర్యంగా ఎదురు నిలిచి నిందితుడుని సర్వీస్ పిస్టల్ తో షూట్ చేసింది. ప్రాణాలకు హాని లేకుండా గాయం అయ్యేలా కాల్చి నిందితుడిని ఆస్పత్రికి తరలించారు. మే 28న జరిగింది ఈ ఘటన.
చిన్నారినిపై అఘాయిత్యానికి పాల్పడిన దుర్మార్గుడు.. ఫైరింగ్ ఆన్ చేయడంతో అక్కడ ఇరు వర్గాలకు ఎన్ కౌంటర్ జరిగింది. తప్పని సరి పరిస్థితుల్లో షూట్ చేయాల్సి వ చ్చిందని ఎస్సై సకినా ఖాన్ తెలిపారు. అయితే ఈ కేసులో బాధితురాలికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు ఎస్సై సకినా.
కేసు రికార్డులో ఎన్ కౌంటర్ జరిగినట్లు నమోదయినట్లు పోలీసు అధికారులు తెలిపారు. సర్వీస్ పిస్టల్ తో షూట్ చేసిన ఎస్సై సకినా ఖాన్ పేరును రికార్డు చేసినట్లు తెలిపారు. దీనిపై ఉత్తరప్రదేశ్ డీసీసీ స్పందించారు. కమల్ కిశోర్ పై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని.. పోలీసులపైకి ఫైర్ చేయడంతో షూట్ చేయాల్సి వచ్చినట్లు చెప్పారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు జరుపుతామని తెలిపారు.
ఈ కేసులో ఎస్సై సకినా ఖాన్ పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తప్పు చేసిందేకాక.. పోలీసులపైకే ఫైరింగ్ ఆన్ చేస్తే ఊరుకుంటారా మరి.. ఒక మహిళా ఎస్సై అయ్యుండి.. ధైర్యంగా ఎన్ కౌంటర్ లో నిలబడి నిందితుడిని అదుపులోకి తీసుకోవడంపై.. ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు..