అనంతపురం: ప్రభుత్వ హాస్పిటల్ లో కరోనాతో ఓ మహిళ చనిపోయి 13 గంటలైనా ఒక్కరూ కూడా పట్టించుకోలేదు. ఈ దారుణ సంఘటన అనంతపురం ప్రభుత్వ హాస్పిటల్ లో జరిగింది. కరోనాతో ఆదివారం ఉదయం 8 గంటలకు ఓ మహిళ మృతి చెందింది. అయితే రాత్రి తొమ్మిది గంటలైనా ఆస్పత్రి సిబ్బంది మృతదేహాన్ని మార్చురీకి తరలించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
విషయం తెలిసిన ట్రైనీ కలెక్టర్ సూర్య స్వయంగా అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. తర్వాత మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కరోనా వార్డు మొత్తానికి ఇద్దరు, ముగ్గురు సిబ్బందే విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. సిబ్బంది కొరతపై ఆస్పత్రి అధికారుల తీరుపై ట్రైనీ కలెక్టర్ సీరియస్ అయ్యారు. సిబ్బందిని పెంచి సకాలంలో వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.