రైల్లో గర్భిణికి పురిటినొప్పులు..కాపాడిన ఆర్మీ డాక్టర్లు

రైల్లో గర్భిణికి పురిటినొప్పులు..కాపాడిన ఆర్మీ డాక్టర్లు

రైలులో ప్రసవం చేసి తల్లీ కూతుళ్లను కాపాడారు ఇండియన్ ఆర్మీ డాక్టర్లు. శనివారం హౌరా ఎక్స్ ప్రెస్ రైలులో వెళుతున్న గర్భిణీకి  సడెన్ గా పురిటి నొప్పులు వచ్చాయి. అదే సమయానికి రైలులో ఉన్న ఆర్మీ డాక్టర్లు ఇద్దరు గర్భిణీకి సహాయం చేశారు.  ఆర్మీ172 మిలిటరీ హాస్పిటల్ కెప్టెన్ లలిత , కెప్టెన్ అమన్‌దీప్ మహిళకు వైద్య సహాయం చేశారు. తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. ఈ విషయాన్ని ఇండియన్ ఆర్మీ అదనపు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ తన  ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.