
దేశ సేవలో భర్త అమరుడైతే ఆయన అడుగుజాడల్లోనే నడిచి ఆర్మీలో చేరిన జ్యోతి నైన్వాల్.. ఆర్మీ ట్రైనింగ్ పూర్తి చేసింది. చెన్నై లోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ లో శనివారం పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన తన పిల్లలతో సంతోషాన్ని పంచుకుంటోందిలా.. జ్యోతి భర్త దీపక్ నైన్వాల్ 2018లో కుల్గాంలో టెర్రరిస్టులతో పోరాడుతూ వీరమరణం పొందారు.