వాగులో దూకిన మహిళ..దొరకని ఆచూకీ

వాగులో దూకిన మహిళ..దొరకని ఆచూకీ

షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లాలో ఓ మహిళ వాగులో దూకింది. ఆమె కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఆచూకీ దొరకలేదు. కొందుర్గ్ మండలం అగిరాల గ్రామానికి చెందిన గుమ్మడి నిర్మల(35) కూలీగా పని చేస్తున్నది. ఆమె మంగళవారం ఉదయం 10 గంటలకు ఫరూఖ్ నగర్ మండలం అయ్యవారిపల్లి గ్రామానికి వచ్చింది. అక్కడ ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో దూకింది. అక్కడున్న స్థానికులు చూసి గ్రామ సర్పంచ్ లక్ష్మీ రమేశ్ కు ఫోన్ చేయగా, ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ALSO READ :వరదల్లో కొట్టుకపోయి ముగ్గురు మృతి

ఎస్సై దేవకీ వాగు దగ్గరికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఫైర్ డిపార్ట్ మెంట్ సిబ్బంది, గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే రాత్రి వరకు కూడా నిర్మల ఆచూకీ లభించకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్ ఆపేశారు. కాగా, నిర్మలకు భర్త, కూతురు ఉంది. ఆమె అగిరాల నుంచి అయ్యవారిపల్లికి ఎందుకొచ్చింది? ఎందుకు వాగులో దూకింది? అనేది తెలియాల్సి ఉంది.