
వివాహేతర సంబంధాలు ఎంత వరకు దారితీస్తాయో ఎవరూ ఊహించలేరు. రిలేషన్షిప్ బాగున్నంత వరకు కన్నూ మిన్నూ ఎరగనట్లు ఉంటుంది వ్యవహారం. ఒక్కసారి హఠాత్తుగా వచ్చిపడే ఊహించని ట్విస్ట్ లు జీవిత గమనాన్నే మార్చేస్తాయి. అలాంటి ఘటనే ఇది. ప్రియుడితో గొడవలో కన్న కూతుర్నే చంపుకుని.. ఊహించని ట్విస్ట్ తో జీవితం తరగబడిన ఇన్సిడెంట్ రాజస్థానలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. జైపూర్ కు చెందిన రోషన్ బాయి అనే మహిళకు మహవీర్ బైరవతో రిలేషన్ షిప్ కొనసాగుతోంది. అయితే ఇద్దరి మధ్యన మొదలైన తగాదా వలన ఆమె కూతురు ఇషిక చనిపోయింది. దీంతో బాడీని పూడ్చేందుకు జూపూర్ నుంచి రాజస్థాన్ వరకు దాదాపు 300 కిలోమీటర్లు ప్రయాణించారు. రాజస్థాన్ లోని బారన్ లో ఉన్న బైరవ ఇంటికి వెళ్లి.. బాడీని చున్నీతో కట్టి.. ఒక ప్లాస్టిక్ బ్యాగులో పెట్టి కబ్బోర్డ్ లో దాచారు.
ఇంట్లో ఎవరూ లేని టైమ్ చూసి బాడీని తీసుకెళ్లి పూడ్చేయాలని ప్లాన్ చేశారు. అయితే అక్కడే ఊహించని ట్విస్ట్ ఎదురైంది ఈ హంతకులకు. కప్ బోర్డ్ నుంచి దారుణమైన వాసన వస్తుండటం, బొట్లు బొట్లుగా రక్తం పడుతుండటం.. శనివారం (మే 31) భైరవ తండ్రి గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో వీళ్లు చేసిన దారుణం బయటపడింది.
బరాన్ ఏఎస్పీ చౌదరీ చెప్పిన వివరాల ప్రకారం.. రోషన్ బాయి తన భర్త రవీందర్ బైరవ నుంచి విడిపోయి తల్లిగారి ఇంటివద్ద ఉంటుంది. వీరిద్దరి సంతానమే ఇషిక. అయితే గత ఏడు నెలలుగా మహవీర్ బైరవతో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మొదలైన గొడవకు కూతురు బలైపోయింది.
ఈ కేసులో మహవీర్ బైరవను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పాప తల్లి రోషన్ బాయి కోసం గాలిస్తు్న్నారు.
మహవీర్ బైరవపై ఇప్పటికే పలు కేసులున్నాయి. ఇతని క్రిమినల్ రికార్డ్స్ లో 15 కేసులు ఉన్నాయి. అందులో మర్డర్ కేసు, దొంగతనాలు, మహిళల్ని వేధించడం వంటి కేసులు ఉన్నాయి. 2022 లో రైతును హత్య చేసిన కేసులో జైలుకు వెళ్లి గత సంవత్సరం బెయిల్ పై బయటకు వచ్చాడు.