ఐదేళ్ల క్రితం శరణ్య లవ్ మ్యారేజ్.. ప్రస్తుతం ఒంటరిగా.. గొంతుకోసి చంపేశారు

ఐదేళ్ల క్రితం శరణ్య లవ్ మ్యారేజ్.. ప్రస్తుతం ఒంటరిగా.. గొంతుకోసి చంపేశారు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల రైల్వేస్టేషన్​ దగ్గరలోని హమాలీవాడలో ఓ మహిళను గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో పొడిచి, బండతో మోది చంపారు. జిల్లా కేంద్రం లోని గోపాల్​వాడకు చెందిన బత్తిని శరణ్య(28)  బెల్లంపల్లి చౌరస్తా దగ్గర్లోని మెడిలైఫ్​ హాస్పిటల్​లో రిసెప్షనిస్టుగా పనిచేస్తోంది. గురువారం సాయంత్రం డ్యూటీ ముగించుకొని హమాలీవాడ మీదుగా ఇంటికి వెళ్తుండగా రైల్వేస్టేషన్​ క్యాబిన్​ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను కత్తితో గొంతులో పొడిచి, తలపై బండతో మోది హత్య చేశారు.

మంచిర్యాలకు చెందిన మహ్మద్​ జియా, శరణ్య 2012లో లవ్​ మ్యారేజ్​ చేసుకున్నారు. వారికి కూతురు మనస్విని (9) ఉంది. జియా సీఐఎస్​ఎఫ్​లో పనిచేస్తున్నాడు.  కుటుంబ గొడవల కారణంగా వీరిద్దరు ఐదేండ్ల నుంచి దూరంగా ఉంటున్నారు.  శరణ్య తన కూతురుతో కలిసి తల్లి దగ్గర ఉంటూ హాస్పిటల్​లో పనిచేస్తోంది. ఘటనా స్థలాన్ని డీసీపీ సుధీర్​ కేకన్​ రాంనాథ్​,  పోలీసులు పరిశీలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదుతో  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.