లక్నో : ఓ మహిళ తన ఐదేండ్ల కూతురిని ఐదు వందలకు అమ్ముతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన యూపీలో జరిగింది. మహిళ తన కూతురిని రూ 500కు విక్రయిస్తోందని టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ రావడంతో మహిళ వ్యవహారం బయటపడింది. దీంతో ముగ్గురు సభ్యులతో కూడిన పోలీసు టీమ్ మహిళను ఇద్దరు కూతుళ్లను ఫరా పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే మహిళ మానసిక పరిస్థితి బాగా లేదని దర్యాప్తులో తేలిందన్న పోలీసులు.. మహిళతో పాటు ఇద్దరు పిల్లల్ని ప్రభుత్వ షెల్టర్ హోంకు తరలించామన్నారు. భర్త ఇంటి నుంచి ఇద్దరు కూతుళ్లతో బయటకు వచ్చిన మహిళ (35)ను రూ 40,000కు ఓ వ్యక్తి కొనుగోలు చేసినట్టు తెలిసిందన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.