
బేగంబజార్ పోలీస్ స్టేషన్ లో మహిళా వీఆర్ఏలు నిరసన చేపట్టారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వీఆర్ ఏలు నిరసన చేపట్టారు. అయితే ఆ సమయంలో వీఆర్ఏలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.అనంతరం కొంతమంది వీఆర్ఏలను పోలీసులు అరెస్ట్ చేసి బేగంబజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాత్రి అవుతున్నా తమను విడుదల చేయకపోవడంతో మహిళా వీఆర్ఏలు స్టేషన్లోనే ఆందోళనకు దిగారు.
ఉదయం నుంచి తమను పోలీస్ స్టేషన్లోనే నిర్భందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ చెప్పిన బంగారు తెలంగాణ ఇదేనా అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో ఆడపడుచులకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. తమ డిమాండ్ లను నెరవేర్చే వరకు పోలీస్ స్టేషన్లోనే ఆందోళన కొనసాగిస్తామన్నారు.