కంట్రోల్ సెంటర్​ పనులు స్పీడప్ ​చేయాలి : అశ్విని తానాజీ వాకడే

కంట్రోల్ సెంటర్​ పనులు స్పీడప్ ​చేయాలి : అశ్విని తానాజీ వాకడే

కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: ఇంటిగ్రేటెడ్​ కమాండ్​ కంట్రోల్​ సెంటర్ ఏర్పాటు పనుల్లో స్పీడప్​ పెంచి, గడువులోగా పూర్తి చేయాలని ఆఫీసర్లను బల్దియా కమిషనర్​ అశ్విని తానాజీ వాకడే ఆదేశించారు. ఆదివారం బల్దియా హెడ్ ఆఫీస్​లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్​ కమాండ్​ కంట్రోల్​ సెంటర్​ ఏర్పాటు పనుల పురోగతిని కమిషనర్​ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

 ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అన్ని డివిజన్ల వ్యాప్తంగా సర్వే నిర్వహించి ఆ సమాచారాన్ని ఐసీసీసీకి అనుసంధానించడం వల్ల నిర్వహణ మెరుగుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్​ఈ ప్రవీణ్​ చంద్ర, ఈఈ సంజయ్​ కుమార్​, ఐటీ మేనేజర్​ రమేశ్​​, టెక్నీషియన్​ పవన్​ తదితరులు ఉన్నారు. 

వెహికల్స్​పై నిఘా పెట్టాండి : గ్రేటర్​ వరంగల్​లో అనుమానాస్పద వెహికల్స్​పై నిఘా పెంచాలని అసిస్టెంట్​ రిటర్నింగ్​ ఆఫీసర్​, బల్దియా కమిషనర్​ అశ్విని తానాజీ వాకడే ఆఫీసర్లను ఆదేశించారు. ఆదివారం వరంగల్​ తూర్పు పరిధిలోని ఎంజీఎం కూడలి ఆన్​ లిమిటెడ్​ వద్ద ఉన్న ఎస్​ఎస్​టి చెక్​ పోస్ట్​ను తనిఖీ చేశారు. ఎన్నికల సంఘం సూచించిన నిబంధనలను పక్కగా పాటించాలని, ప్రతి వాహనాన్ని పరిశీలించాలని చెప్పారు. డబ్బు, మద్యం ఇతర వస్తువుల తరలింపు పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.