శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం ... అరవడి పాయసం గురించి 11 నిజాలు

శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం ... అరవడి పాయసం గురించి 11 నిజాలు

అయ్యప్పమాల దీక్ష చేస్తూ 41రోజుల దీక్ష పూర్తి అయిన తర్వాత ఇరుముడి కట్టుకుని శబరిలో ఉన్న అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి బయలుదేరుతారు.మనవాళ్లల్లో కూడా స్వాములు అలా వెళితే వాళ్లు క్షేమంగా తిరిగి రావాలని కోరుకోవడం తో పాటు వారు తెచ్చే ప్రసాదం కోసం కూడా చాలా ఎదురుచూస్తాం.  పాకంలా నల్లగా డబ్బాల్లో ప్యాక్ చేసి ఉండి దాన్ని తింటుంటే ....అబ్బా చాలా టేస్టీగా ఉంటుంది కదా…చెప్తుంటేనే నోరూరుతుందా. అయితే  ఆ ప్రసాదం గురించి కొన్ని ఆసక్తి కరమైన విషయాలు తెలుసుకుందాం. . .

 ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుపొందింది అయ్యస్వామి అరవడి పాయసం ప్రసాదం.  41 రోజులు కఠోర నియమాలతో దీక్ష పూర్తి చేసి... శబరిమల స్వామికి ఇరుముడి సమర్పించి... అక్కడి నుంచి ప్రసాదంగా అభిషేకం చేసిన నెయ్యితో పాటు పాయసం( అరవడి పాయసం) డబ్బా కూడా తీసుకొస్తారు. కేరళ శబరిమల అయ్యప్పస్వామి దేవాలయంలో ప్రసాదంగా లభించే అరవడి పాయసం ఎంతో టేస్టీగా ఉంటుంది.  చలికాలంలో ఇది తింటే ఆరోగ్యం కూడా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.  

  • 1.అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్న స్వాములు తీసుకొచ్చే అయ్యప్ప ప్రసాదం పేరు అరవణి ప్రసాదం .
  • 2.స్వామి దర్శనానికి వచ్చే భక్తులు యాత్ర ముగించుకుని వచ్చేటప్పుడు స్వామివారి ప్రసాదాలు అరవణ పాయసం, అప్పం తప్పకుండా తీసుకుంటారు.
  • 3.బియ్యం, నెయ్యి, బెల్లాన్ని ఉపయోగించి ఈ ప్రసాదం తయారు చేస్తారు.అనేక పోషక పదార్ధాల మిలితం అయిన ఈ ప్రసాదం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
  • 4.చలికాలంలో అరవణి ప్రసాదం తింటే శరీరంలో వేడిని కలిగిస్తుంది.
  • 5.ఈ ప్రసాదానికి వాడే బియ్యం మావెలిక్కరలోని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు పరిధిలోని చెట్టికులంగర దేవి ఆలయం నుంచి వస్తాయి.
  • 6.ప్రతి సంవత్సరం ఈ దేవాలయాన్ని కనీసం రెండు నుంచి పది లక్షల మండి దర్శించుకుంటారని అంచనా.
  • 7.భక్తుల కోసం ప్రతి ఏడాది 80 లక్షల అరవణ ప్రసాదాన్ని తయారు చేస్తారట.
  • 8.తిరుమల తరువాత అత్యంత ఎక్కువ మంది భక్తులు దర్శించుకునే దేవాలయం శబరిమల కావడం విశేషం.తిరుమల లడ్డు తర్వాత అరవణి ప్రసాదానికి అంత పేరుంది.
  • 9.దేవస్వామ్ బోర్డు పరిధిలోని మావెలిక్కర చెట్టికులంగర దేవి ఆలయం నుంచి ప్రసాదం తయారీకి అవసరమైన బియ్యం సరఫరా అవుతాయి.
  • 10.ఒక్కో డబ్బా 250 గ్రాముల బరువు ఉంటుంది.
  • 11.ప్రసాదం తయారీకి సంబంధించి నాణ్యతలో ఎలాంటి లోపాలు లేకుండా ఉండేందుకుగాను మైసూరులోని కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధన సంస్థ సభ్యులను సలహాదారులుగా దేవస్వామ్ బోర్డు నియమించింది

Also Read:-జై శ్రీరాం : అయోధ్యకు 100 రోజుల్లో.. వెయ్యి రైళ్లు