న్యూఢిల్లీ: ఇండియా హాకీ టీమ్ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్ను ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డును శ్రీజేష్ గెలుచుకున్నాడు. ఈ పురస్కారం అందుకున్న సెకండ్ ఇండియన్గా నిలిచాడు. 2020లో ఇండియా విమెన్స్ టీమ్ కెప్టెన్ రాణి రాంపాల్ ఫస్ట్ టైమ్ ఈ ఘనత సాధించింది. ఇండియా మాజీ కెప్టెన్ అయిన శ్రీజేశ్.. టోక్యో ఒలింపిక్స్లో హాకీ టీమ్ బ్రాంజ్ మెడల్ నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో, 33 ఏళ్ల ఈ వెటరన్ ప్లేయర్ను ఈ అవార్డు కోసం ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ (హెచ్ఎఫ్ఐ) నామినేట్ చేసింది. ఓటింగ్లో శ్రీజేశ్కు అందరికంటే ఎక్కువగా లక్షా 27 వేల 647 ఓట్లు వచ్చాయి.
సెకండ్ ప్లేస్లో నిలిచిన స్పెయిన్కు చెందిన రాక్ క్లైంబర్ ఆల్బర్టో లోపేజ్కు 67,428 ఓట్లు రాగా, ఈ అవార్డు కోసం పోటీ పడ్డ ఇటలీ ఉషు ప్లేయర్ జియార్డనోకు 52,046 ఓట్లే వచ్చాయి. ఇంత గొప్ప అవార్డుకు ఎంపికవడం తనకు గర్వకారణం అని శ్రీజేశ్ అన్నాడు. తనను నామినేట్ చేసిన హెచ్ఎఫ్ఐకి, ఓటు వేసిన ఇండియన్ హాకీ ఫ్యాన్స్కు థ్యాంక్స్ చెప్పాడు. టోక్యోలో బ్రాంజ్ గెలిచిన తన టీమ్మేట్స్కు ఈ అవార్డును డెడికేట్ చేస్తున్నట్టు తెలిపాడు.
