- వొడాఫోన్కు రూ. 1.5 కోట్లు, మిగిలిన ఫండ్స్
- యూఎన్ రిఫ్యూజి ఏజెన్సీకి
న్యూఢిల్లీ: ప్రపంచంలోని మొదటి ఎస్ఎంఎస్ వేలానికి రాబోతోంది. 30 ఏళ్ల క్రితం (డిసెంబర్ 3, 1992 న) వొడాఫోన్ కంపెనీలో ఎస్ఎంఎస్ కమ్యూనికేషన్పై పనిచేసిన ఇంజినీర్ నీల్ పాప్వర్త్ తన మొదటి టెస్టింగ్ ఎస్ఎంఎస్ను రిచార్డ్ జార్విస్ (బిజినెస్మ్యాన్) కు పంపించారు. ‘మెర్రీ క్రిస్మస్’ అని ఉండే ఈ సింపుల్ మెసేజ్ ప్రస్తుతం రూ. కోట్లు రాల్చబోతోంది. ఈ ఎస్ఎంఎస్ను వొడాఫోన్ నెట్వర్క్ నుంచి ఆర్బిటల్ 901 హ్యాండ్సెట్కు పంపారు. ప్రస్తుతం ఈ మెసేజ్ను ఎన్ఎఫ్టీ మార్చి వేలం వేస్తున్నారు. ఈ వేలంలో వచ్చిన ఫండ్స్ను యూఎన్ రిఫ్యూజి ఏజెన్సీకి, యూఎన్ హైకమిషనర్ ఫర్ రిఫ్యూజికి విరాళంగా అందిస్తారు. వొడాఫోన్ ఐడియాకు రెండు లక్షల డాలర్లు (రూ. 1.5 కోట్లు) అందుతాయి. ఈ వేలం తర్వాత ప్రపంచంలోని మొదటి ఎస్ఎంఎస్కు సంబంధించి ఎటువంటి ఎన్ఎఫ్టీని లేదా కాయిన్ను ఇష్యూ చేయబోమని వొడాఫోన్ ప్రకటించింది. ఈ ఎన్ఎఫ్టీ ఆక్షన్ ఫ్రాన్స్లోని ఒక ఇండిపెండెంట్ ఆక్షన్ హౌస్లో జరుగుతుంది. ఆన్లైన్లో కూడా బిడ్స్ వేసుకోవచ్చు. ఈ ఎన్ఎఫ్టీ అథంటిసిటీని పెంచేందుకు బయ్యర్కు డిజిటల్ గ్యారెంటీ సర్టిఫికేట్ను వొడాఫోన్ సీఈఓ నిక్ రీడ్ అందిస్తారు. ఎన్ఎఫ్టీకి సంబంధించిన డాక్యుమెంట్లు, రిసీట్లను అందిస్తారు. టీఎక్స్టీ, పీడీఎఫ్ ఫార్మెట్లో కూడా ఈ మెసేజ్ను బయ్యర్కు ఇస్తారు.
వివీఐపీ నెంబర్ ఇంటికే..
తమ కస్టమర్లు కావాలనుకుంటే వీఐపీ లేదా ప్రీమియం నెంబర్లను వాళ్ల ఇంటికే తెచ్చి ఇస్తామని వొడాఫోన్ ఐడియా (వి) ప్రకటించింది. కస్టమర్లు తమ లక్కీ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ లేదా ఏ ఇతర నెంబర్నైనా తమ వీఐపీ నెంబర్గా ఎంచుకోవచ్చని పేర్కొంది. ప్రీపెయిడ్తో పాటు పోస్ట్పెయిడ్ కస్టమర్లు కూడా ఈ సర్వీసులను పొందొచ్చు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, పుణే, చెన్నై, కోల్కతా, బెంగళూరు, అహ్మదాబాద్, సూరత్, జైపూర్ సిటీలలోని కస్టమర్లకే వీఐపీ నెంబర్లను వాళ్ల ఇంటికే తెచ్చి ఇస్తామని వి ప్రకటించింది.
