ఇందిరమ్మ ఇండ్ల పైసలు వస్తున్నయా..? : యాదాద్రి కలెక్టర్ అనురాగ్

ఇందిరమ్మ ఇండ్ల పైసలు వస్తున్నయా..? : యాదాద్రి కలెక్టర్ అనురాగ్
  •     లబ్ధిదారులను ఆరా తీసిన కలెక్టర్​

యాదాద్రి​, వెలుగు :  ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేసుకోవాలని లబ్దిదారులకు యాదాద్రి కలెక్టర్​ అనురాగ్​ జయంతి సూచించారు. గురువారం జిల్లాలోని గుండాల మండలం అనంతారంలో నిర్మాణంలో ఉన్న ఇండ్లను పరిశీలించారు. ఇండ్ల బిల్లులు అకౌంట్లో పడుతున్నయా..? అని లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా నిర్మాణం పూర్తి చేసుకొని గృహ ప్రవేశం చేయాలని సూచించారు. 

శిథిలావస్థకు చేరిన అంగన్​వాడీ సెంటర్లకు కొత్త బిల్డింగ్​కు శాంక్షన్​ చేయిస్తానని తెలిపారు. బీబీనగర్​లోని వయో వృద్ధుల  డే కేర్​ సెంటర్​ను సందర్శించారు. వృద్ధులకు అందిస్తున్న వైద్య సేవలు, చికిత్స విధానాలపై ఆరా తీశారు. అనంతరం పలు కొనుగోలు సెంటర్లను పరిశీలించి, కొనుగోళ్లలో స్పీడ్​ పెంచాలని ఆయన ఆదేశించారు.