
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ మహాకుంభ సంప్రోక్షణకు అంతా సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటల 55 నిమిషాలకు మహాకుంభ సంప్రోక్షణ జరగనుంది. రేపు సాయంత్రం 4 గంటల నుంచి స్వామివారి దర్శనాలకు భక్తులను అనుమతించనున్నారు. ఇవాళ రాత్రి సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా యాదాద్రికి చేరుకోనున్నారు. రేపు జరిగే మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 12 వందల 80 కోట్ల నిధులతో యాదాద్రిని పునర్ నిర్మించింది ప్రభుత్వం. 2015లో పునర్ నిర్మాణాన్ని మొదలు పెట్టగా ఇటీవలే నిర్మాణం పూర్తైంది. ప్రధానాలయం పునర్ నిర్మాణంతో 2016 ఏప్రిల్ 21 నుంచి బాలాలయంలో భక్తుల దర్శనాలు అనుమతిచ్చారు. ఇవాళ్టితో బాలాలయంలో దర్శనాలు ముగియనున్నాయి.
7వ రోజు పంచకుండాత్మక మహాయాగం
ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా బాలాలయంలో 7వ రోజు పంచకుండాత్మక మహాయాగాన్ని నిర్వహిస్తున్నారు. ఉదయం శాంతిపాఠం, చతుఃస్థానార్చన, మూల మంత్ర హావనములు, అష్టోత్తర శత కలశాభిషేకం, నిత్య లఘు పూర్ణాహుతి జరిగాయి.
రేపు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పునః ప్రారంభం
- మహాకుంభ సంప్రోక్షణలో పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు
- రేపు ఉదయం 9.30 గంటలకు బయలుదేరనున్న ముఖ్యమంత్రి
- బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్లనున్న కేసీఆర్ దంపతులు
- ఉదయం 11.55 గంటలకు జరిగే మహాకుంభ సంప్రోక్షణలో పాల్గొననున్న ముఖ్యమంత్రి కేసీఆర్
- మధ్యాహ్నం 12.10 గంటలకు ప్రధాన ఆలయ ప్రవేశం, స్వర్ణ ధ్వజస్తంభ సందర్శనలో పాల్గొననున్న కేసీఆర్
- మధ్యాహ్నం 12.20 నుండి 12.30 శ్రీ స్వామివారి గర్భాలయ దర్శనం
- యాదాద్రి ఆలయ పున ప్రారంభ పూజా కార్యక్రమాల్లో పాల్గొని దైవ దర్శనం చేసుకోనున్న ముఖ్యమంత్రి కేసీఆర్
ఇవి కూడా చదవండి
యాదాద్రి జిల్లాలో కోతికి అంత్యక్రియలు