
ముషీరాబాద్, వెలుగు: ఈ నెల 15న తార్నాక మెట్టుగూడ రైల్వే ఆఫీసర్స్ క్లబ్లో యానాదుల ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర యానాది వెల్ఫేర్ అసోసియేషన్ తెలిపింది. శుక్రవారం చిక్కడపల్లిలోని అసోసియేషన్ కార్యాలయంలో ఆ సంస్థ ప్రతినిధులు సాంబశివరావు, చిన్న శేషాద్రి, శ్రీనివాసులు సభ పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు.
ఆదివారం సభతో పాటు జనరల్ బాడీ మీటింగ్, ఫ్యామిలీ గెట్ టు గెదర్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్య అతిథులుగా షెడ్యూల్ ట్రైబల్స్ నేషనల్ కమిషన్ మెంబర్ హుస్సేన్, ఐఏఎస్ అధికారులు శ్రీధర్, సారథి, షెడ్యూల్ ట్రైబ్స్ ప్రతినిధి ఆంజనేయులు హాజరవుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు రమణ పాల్గొన్నారు.