యశ్ చోప్రా సతీమణి కన్నుమూత

 యశ్ చోప్రా సతీమణి కన్నుమూత

బాలీవుడ్ లెజెండరీ డైరక్టర్ యశ్ చోప్రా సతీమణి  పమేలా చోప్రా ఏప్రిల్ 20 గురువారం రోజు ఉదయం  కన్నుమూశారు. ప్రస్తుతం ఆమెకు 74 సంవత్సరాలు. పమేలా చోప్రా సుప్రసిద్ధ భారతీయ నేపథ్య గాయని. పలు సినిమాల్లో పాటలు పాడిన ఆమె  యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన కొన్ని చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు. అనారోగ్య  సమస్యలతో బాధపడుతోన్న  ఆమె గత 15 రోజులుగా ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందతూ కన్నుమూశారు.  

వైద్యులు ఆమెకు ఇన్ని రోజులు వెంటిలేటర్‌పై చికిత్సను అందించారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ముంబైలో ఆమె అంత్యక్రియలు జరిగినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. పమేలా 1970లో యశ్ చోప్రాను  వివాహం చేసుకుంది. వీరికి ఆదిత్య చోప్రా ,ఉదయ్ చోప్రా అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.  వీరిద్దరూ ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారు.  బాలీవుడ్ లో ఎన్నో గొప్ప సినిమాలు తీసిన యశ్ చోప్రా 2012లో కన్నుమూశారు.