మోడీ సభకు ఒకరోజు ముందే హైదరాబాద్కు యశ్వంత్​ సిన్హా

మోడీ సభకు ఒకరోజు ముందే హైదరాబాద్కు యశ్వంత్​ సిన్హా

హైదరాబాద్, వెలుగు: విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా రాష్ట్రపతి పదవికి పోటీచేస్తున్న యశ్వంత్ సిన్హా జులై 2న హైదరాబాద్​కు రానున్నారు. రాష్ట్రంలోని 3 పార్టీల నేతలతో ఆయన విడివిడిగా భేటీ కానున్నట్లు తెలిసింది. టీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్​నేతలతో ఆయన ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నారు. ముందుగా సీఎం కేసీఆర్‌‌తో భేటీ కానున్నట్లు తెలిసింది. రాష్ట్రపతి ఎన్నికలో ఓటు హక్కు ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి, కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు, మజ్లిస్ చీఫ్​ అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం ఎమ్మెల్యేలతో ​సిన్హా భేటీ కానున్నారు.