
హైదరాబాద్, వెలుగు: విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా రాష్ట్రపతి పదవికి పోటీచేస్తున్న యశ్వంత్ సిన్హా జులై 2న హైదరాబాద్కు రానున్నారు. రాష్ట్రంలోని 3 పార్టీల నేతలతో ఆయన విడివిడిగా భేటీ కానున్నట్లు తెలిసింది. టీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్నేతలతో ఆయన ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నారు. ముందుగా సీఎం కేసీఆర్తో భేటీ కానున్నట్లు తెలిసింది. రాష్ట్రపతి ఎన్నికలో ఓటు హక్కు ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు, మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం ఎమ్మెల్యేలతో సిన్హా భేటీ కానున్నారు.