యాత్ర2 మొదలైంది.. 2024 ఎలక్షన్సే టార్గెట్

యాత్ర2 మొదలైంది.. 2024 ఎలక్షన్సే టార్గెట్

దర్శకుడు మహి.వి రాఘవ్(Mahi v Raghav)  తెరకెక్కించిన యాత్ర(Yatra) మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajashekar reddy) చేపట్టిన పాదయాత్ర ఆధారంగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి(Mammootty) ఈ సినిమాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా కనిపించి మెప్పించారు. 

ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా యాత్ర2(Yatra2) తెరకెక్కుతోందని ప్రకటించారు డైరెక్టర్ మహి రాఘవ్. ఈ సినిమా 2024 ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది అంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. ఈ సందర్బంగా కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. “నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి… నేను వైయస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని” అనే డైలాగ్ ని పోస్టర్ లో యాడ్ చేశారు మేకర్స్. ఈ డైలాగ్ కు ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత వైఎస్ జగన్(YS Jagan) చేపట్టిన ఓదార్పు యాత్ర నుండి ఆయన సీఎం అయ్యేవరకు జరిగిన విషయాలను యాత్ర2 సినిమాలో చూపించనున్నారు డైరెక్టర్ మహి వీ రాఘవ్. అయితే ఈ సినిమాలో మమ్ముట్టి నటిస్తున్నారా? జగన్ పాత్రలో ఎవరు నటిస్తున్నారు అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. యువీ సెల్ల్యులాయిడ్స్, త్రీ ఆటుమైన లీఫ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు.. సంతోష్ నారాయణ్(Santhosh narayan) సంగీతం అందిస్తున్నారు.