అనంతపురం జిల్లాలోని తన సొంత నియోజక వర్గమైన హిందూపురంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే బాలకృష్ణ ను వైసీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఏపీ కి మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకించినందుకు బాలకృష్ణపై నిరసన వ్యక్తం చేశారు. ఆయన కాన్వాయ్ను అడ్డుకొని, గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వికేంద్రీకరణకు ఎందుకు అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమలో హైకోర్టును ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు.
ఈ నిరసనలో టీడీపీ కార్యకర్తలు, వైసీపీ నేతల మధ్య గొడవ జరిగింది. పోలీసులు కల్పించుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. నిరసనకారులను అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.