గుండెపోటుతో ఎమ్మెల్సీ కరీమున్నీసా మృతి

గుండెపోటుతో ఎమ్మెల్సీ కరీమున్నీసా మృతి

ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎమ్మెల్సీ కరీమున్నీసా  గుండెపోటుతో మృతిచెందారు. ఆమెకు శుక్రవారం రాత్రి గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూనే తుదిశ్వాస విడిచారు. విజయవాడకు చెందిన కరీమున్నిసా గతేడాది ఫిబ్రవరిలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆమె రెండు రోజులుగా మండలి సమావేశాలకు హాజరవుతున్నారు. కరీమున్నీసా గతంలో విజయవాడ సెంట్రల్ కార్పొరేటర్ గా పనిచేశారు.