వైసీపీ ఎంపీ రఘురామకు చుక్కెదురు

వైసీపీ ఎంపీ రఘురామకు చుక్కెదురు
  • క్వాష్​ పిటిషన్​ను కొట్టేసిన కోర్టు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ హైకోర్టులో వైఎస్సార్​సీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణ రాజుకు ఎదురుదెబ్బ తగిలింది. గచ్చిబౌలి పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏపీ ఇంటెలిజెన్స్​ కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫరూఖ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాషా చేసిన ఫిర్యాదు మేరకు నమోదైన ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొట్టేయాలని ఎంపీ, ఆయన కొడుకు వేసిన క్వాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను హైకోర్టు డిస్మిస్​ చేసింది. విచారణ కూడా జరగకుండా ప్రాథమిక దశలోనే కొట్టేయలేమని చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉజ్జల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూయాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారు. భీమవరంలో జరిగిన అల్లూరి విగ్రహావిష్కరణ  కార్యక్రమానికి రైల్లో వెళ్తుంటే పోలీసులు వెంబడిస్తున్నారనే అనుమానం వచ్చిందని పిటిషనర్​ తరఫు అడ్వకేట్ కోర్టుకు వివరించారు.

వెంబడించిన వ్యక్తిని గచ్చిబౌలి పీఎస్​కు తీసుకెళ్లి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని, ఫరూఖ్ ఇచ్చిన ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారన్నారు. దీన్ని కొట్టేయాలని విన్నవించారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వ ప్లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి స్పందిస్తూ.. ఎంపీ సమక్షంలోనే ఫరూఖ్​ను ఆయన కొడుకు భరత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొట్టాడని కోర్టుకు విన్నవించారు. ఫరూఖ్​ ఫిర్యాదుపై విచారించాల్సిందే అని కోరారు. ఏపీ గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పి.గోవింద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి వాదిస్తూ.. రఘురామకృష్ణ రాజు, ఆయన కుమారుడు, వ్యక్తిగత భద్రతా అధికారి, సీఆర్పీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఫరూఖ్​ను చితకబాదారని వివరించారు. వాదనల తర్వాత కోర్టు పిటిషన్​ను కొట్టివేసింది.