లోక్ సభ ఏడో విడత పోలింగ్ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్లోని 246 పోలింగ్ బూత్ లో ఓటు వేశారు.బీహార్ సీఎం నితీశ్ కుమార్ పట్నాలోని రాజ్భవన్ దగ్గరలోని పాఠశాలలో ఏర్పాటు చేసిన 326 పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ పంజాబ్ లోని జలందర్ జిల్లాలోని గర్హి విలేజ్ లో క్యూలో నిలబడి ఓటు వేశారు.


