- జాబ్ నోటిఫికేషన్లు పడ్తలేవని యువకుడి సూసైడ్
- నిజామాబాద్ జిల్లాలో ఘటన
నవీపేట్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాకపోవడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు విషం తాగి సూసైడ్ చేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లా నవీపేట్మండలంలో జరిగిన ఈ ఘటన జరిగింది. మండలంలోని తడగామా గ్రామానికి చెందిన నేతికుంట చందు(30) డిగ్రీ పూర్తి చేసి ఓ ప్రైవేటు బ్యాంక్లో పనిచేస్తున్నాడు. జాబ్ చేస్తూనే.. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నాడు. సర్కార్ నోటిఫికేషన్లు ఇవ్వకడం లేదని తరచూ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకునే వాడు. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురై ఈ నెల 16న విషం తాగాడు. గమనించిన కుటుంబీకులు హాస్పిటల్కు తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ చందు గురువారం మృతి చెందాడు.