జాబ్ రాక మరో యువకుడు సూసైడ్

జాబ్ రాక మరో యువకుడు సూసైడ్
  • జాబ్​ నోటిఫికేషన్లు పడ్తలేవని యువకుడి సూసైడ్
  • నిజామాబాద్ ​జిల్లాలో ఘటన

నవీపేట్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్​ రాకపోవడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు విషం తాగి సూసైడ్​ చేసుకున్నాడు. నిజామాబాద్​ జిల్లా నవీపేట్​మండలంలో జరిగిన ఈ ఘటన జరిగింది. మండలంలోని తడగామా గ్రామానికి చెందిన నేతికుంట చందు(30) డిగ్రీ పూర్తి చేసి ఓ ప్రైవేటు బ్యాంక్​లో పనిచేస్తున్నాడు. జాబ్​ చేస్తూనే.. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ ​అవుతున్నాడు. సర్కార్​ నోటిఫికేషన్లు ఇవ్వకడం లేదని తరచూ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకునే వాడు. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురై ఈ నెల 16న విషం తాగాడు. గమనించిన కుటుంబీకులు హాస్పిటల్​కు తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ చందు గురువారం మృతి చెందాడు.