బావని కిరాతకంగా హత్య చేసిన బావమరిది

బావని కిరాతకంగా హత్య చేసిన బావమరిది
  • ఆదిలాబాద్ జిన్నింగ్ ఫ్యాక్టరీ దగ్గర దారుణం
  • కుటుంబ కలహాలే కారణం

ఆదిలాబాద్‌లో దారుణం జరిగింది. సొంత బావను బావమరిది కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మమత జిన్నింగ్ ఫ్యాక్టరీ ఎదురుగా ఈ ఘటన జరిగింది.

మనోజ్ (20) అనే యువకుడిని అతడి సొంత బావ మరిది సంతోష్ హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన పోలీసులు కుటుంబ కలహాల కారణంగానే ఈ హత్య జరిగినట్లు నిర్ధారించారు. హత్యకు పాల్పడిన సంతోష్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని చెప్పారు.