పెట్రోల్ పోసుకొని టీఆర్ఎస్ కార్యకర్త సూసైడ్ అటెంప్ట్

పెట్రోల్ పోసుకొని టీఆర్ఎస్ కార్యకర్త సూసైడ్ అటెంప్ట్
  • రాజ్​భవన్ ఎదుట టీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

ఖైరతాబాద్, వెలుగు: కేసీఆరే నా దేవుడు.. ఆయనే తనకు సాయం చేయాలంటూ రాజ్ భవన్ వద్ద ఓ టీఆర్ఎస్ కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. సూర్యాపేట జిల్లా, మోతె మండలం, లాలాతండాకు చెందిన నాగరాజు అలియాస్ నాగార్జున కేసీఆర్ అభిమాని. గురువారం సాయంత్రం రాజ్ భవన్​కు చేరుకుని జై తెలంగాణ, జై కేసీఆర్, జై జగదీశ్వర్ రెడ్డి అంటూ నినాదాలు చేస్తూ ఒంటిమీద పెట్రోల్ పోసుకున్నాడు. నిప్పంటించుకునేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. కండ్లలో పెట్రోల్ పడటంతో కేకలు వేస్తూ సీఎం సారే నన్నాదుకోవాలని వేడుకున్నాడు. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి పంజాగుట్ట స్టేషన్ కు తీసుకెళ్లారు. మూడేండ్ల కింద కూడా ఇదే వ్యక్తి ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేస్తూ రాజ్​భవన్​ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. నాగరాజు తన కూతురుకు మూడు నెలల కింద పెండ్లి చేశాడని, అప్పుల బాధలు ఎక్కువయ్యాయని లాలాతండా వాసులు చెప్తున్నారు.