రంగారెడ్డి జిల్లా : కిరోసిన్ పోసుకుని యువతి నిప్పంటించుకున్న సంఘటన సోమవారం హైదరాబాద్ లో జరిగింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని.. గంధంగూడా విలేజ్ లోని, బృందావన్ కాలనీకి చెందిన దివ్య(20) విద్యార్థి వంటిపై కొరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో బాత్ రూమ్లో ఒంటిపై పెట్రోల్ పోసుకొని యువతి బలవన్మరణానికి పాల్పడింది. కేకలు విన్న స్థానికులు మంటలను ఆర్పి హాస్పిటల్ కి తరలించారు.
నాలనగర్ ఉన్న ప్రీమియర్ హాస్పిటల్ కు తీసుకువెళ్లగా పరిస్థితి విషమించడంతో.. అక్కడి డాక్టర్లు వేరే హాస్పిటల్ కు తీసుకెళ్ళమని చెప్పారు. బంజారాహిల్స్ లో ఉన్న విరించి ఆస్పటల్ కి తరలించారు. అయితే దివ్వ చికిత్స పొందుతూ మృతి చెందిందని తెలిపారు డాక్టర్లు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 90% కాలిపోవడంతో యువతి మృతి చెందిందని డాక్టర్లు తెలిపారన్నారు పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దీంతో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. అయితే దివ్వ చనిపోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.