- ప్రేమించిన యువకుడితో పెళ్లి చేయాలని పీఎస్లో యువతి ఆత్మహత్యా యత్నం
ముదిగొండ, వెలుగు: ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయాలని కోరుతూ ఓ యువతి ముదిగొండ పోలీస్స్టేషన్లో పురుగులు మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినేపల్లికి చెందిన ఓ యువతి, అదే గ్రామానికి చెందిన దరిపల్లి రాజ్కుమార్ ఆరేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. చివరికి ముఖం చాటేశాడు. దీంతో సదరు యువతి రాజ్కుమార్ఇంటి ముందు రెండు రోజుల పాటు బైఠాయించి మౌనవ్రతం చేసింది. అలాగే గతనెల 25న ముదిగొండ పీఎస్కు వెళ్లి ఈ విషయాన్ని పోలీసులకు తెలిపింది. ఎస్సై తాండ్ర నరేశ్ కంప్లైంట్ఇస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫిర్యాదు వద్దని రాజ్కుమార్తో తనకి పెళ్లి చేయమని యువతి కోరింది. ఇటీవల మరోసారి డయల్100కు కాల్చేయడంతో పోలీసులు ఇద్దరినీ స్టేషన్కు పిలిపించారు. రాజ్కుమార్ని అడగగా పెళ్లికి నిరాకరించాడు. దానికితోడు అతనికి కరోనా సోకడంతో తగ్గాక రావాల్సి ఉంటుందని చెప్పి పంపించారు. మంగళవారం మరోసారి యువతి పోలీస్స్టేషన్కు వచ్చి రాజ్కుమార్తో పెళ్లి చేయాలని కోరింది. వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగింది. సిబ్బంది ఆమెను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఖమ్మం రూరల్సీఐ సత్యనారాయణరెడ్డి తెలిపారు. రాజ్కుమార్పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెంది యువతి ఆత్మహత్యా యత్నం చేసిందని తెలిపారు. ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆ గ్రామ పెద్దలతో మాట్లాడామని.. ఆమెకు ఎవరూ లేరని వివరించారు.