హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో యువతి మిస్సింగ్

హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో యువతి మిస్సింగ్

కూకట్​పల్లి, వెలుగు: కేపీహెచ్బీ కాలనీలోని పీజీ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్న యువతి మిస్సయింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. వరంగల్​కు చెందిన కొయ్యడ దీపిక(25) ఈ నెల 1 నుంచి కేపీహెచ్​బీ కాలనీ రెండో రోడ్డులోని వీఆర్​ ఉమెన్స్​ పీజీ హాస్టల్లో ఉంటోంది. గురువారం సాయంత్రం 5:30 గంటల సమయంలో హాస్టల్​ నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. హాస్టల్​ నిర్వాహకులు దీపిక కుటుంబ సమాచారమిచ్చారు. యువతి సోదరుడు శుక్రవారం కేపీహెచ్​బీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.