అన్నపై రోకలిబండతో తమ్ముడి దాడి

అన్నపై రోకలిబండతో తమ్ముడి దాడి
  •     చికిత్స పొందుతూ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మృతి
     

గోదావరిఖని, వెలుగు: అన్నను రోకలిబండతో కొట్టగా చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గోదావరిఖని అడ్డగుంటపల్లికి చెందిన దాస సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, (38), నరేశ్, హరీశ్​అన్నదమ్ములు. అడ్డగుంటపల్లిలో ఇంటి స్థలం విషయంలో సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నరేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మధ్య వివాదం ఉంది. ఇంటి స్థలాన్ని అమ్మాలని అన్నపై తమ్ముడు రెండేండ్లుగా ఒత్తిడి చేస్తున్నాడు. 

సురేశ్​ఒప్పుకోకపోవడంతో ఈ నెల 18న ఇద్దరూ మందు తాగి స్థలం విషయమై గొడవపడ్డారు. మందు మత్తులో తమ్ముడు నరేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. రోకలిబండతో అన్న తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడిన సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కుటుంబసభ్యులు గోదావరిఖని హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు, అక్కడి నుంచి కరీంనగర్​హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం సురేశ్​చనిపోయాడు. మృతుడి చిన్న తమ్ముడు హరీశ్​ఫిర్యాదు మేరకు గోదావరిఖని వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీఐ ప్రమోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.