భూమి కోసం గొడవ‌‌‌‌..  తల్లి, తమ్ముడి హత్య

భూమి కోసం గొడవ‌‌‌‌..  తల్లి, తమ్ముడి హత్య


సూర్యాపేట వెలుగు: అన్నాదమ్ముళ్ల మధ్య స్థల వివాదం రెండు ప్రాణాలను బలితీసుకుంది. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం కండగట్ల గ్రామానికి చెందిన తూరుపాటి మరియమ్మ(70) కు ఆరుగురు కొడుకులు. చిన్న కొడుకు శ్రీనివాస్(30), నాలుగో కొడుకు లచ్చయ్య కలిసి కొంతకాలం కింద సూర్యాపేట మండలం గాంధీ నగర్ లో  రెండు గుంటల స్థలం కొన్నారు.  ఆ భూమిని తమ్ముడికి తెలియకుండా అన్న అమ్మేశాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతోంది. వీరి ఇండ్లు కూడా పక్కపక్కనే కావడంతో రెండు కుటుంబాలు ఎప్పుడూ గొడవ పడుతూనే ఉన్నాయి.  సోమవారం శ్రీనివాస్​ ఇంటినుంచి నీళ్లు తమ ఇంటిదిక్కు రావడంతో గొడవకు దిగిన లచ్చయ్య పందులను చంపే బరిసెతో దాడికి దిగాడు. అతన్ని అపేందుకు తల్లి అడ్డు రాగా ఇద్దరిని పొడిచాడు. తల్లి మారియమ్మ, శ్రీనివాస్​ ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. దాడి చేసిన లచ్చయ్య అక్కడి నుంచి పారిపోయాడు.