రాహుల్.. మీ వారసత్వం అంతమవుతోంది

రాహుల్.. మీ వారసత్వం అంతమవుతోంది

న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలు ముగిసిపోయినట్లేనని ప్రధాన్ అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం చనిపోతోందన్న రాహుల్ వ్యాఖ్యలకు కౌంటర్‌‌గా ప్రధాన్ పైకామెంట్స్ చేశారు. ‘ఒకవైపు ప్రజాస్వామ్యానికి తలొగ్గి పని చేస్తున్న ప్రధాని మోడీ ఉన్నారు. మరోవైపు అవకాశం వచ్చినప్పుడల్లా దేశ పరువు తీయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే ప్రధాని క్యాండిడేట్ ఉన్నారు. రాహుల్ జీ.. చనిపోతోంది ప్రజాస్వామ్యం కాదు, మీ వారసత్వం’ అని ప్రధాన్ ట్వీట్ చేశారు.