V6 News

ట్రాక్టర్‎ను ఢీకొని యువకుడు మృతి

ట్రాక్టర్‎ను ఢీకొని యువకుడు మృతి

పరిగి, వెలుగు: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. చోన్గొముల్​ఎస్సై భరత్​ కుమార్​రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్​ జిల్లా పూడూరు మండలంలోని ఎన్కెపల్లికి చెందిన హరిశంకర్​గౌడ్(23) బైక్​పై సోమవారం రాత్రి గ్రామం నుంచి మన్కెగూడ వెళ్తున్నాడు. అదే సమయంలో పాతూరు నుంచి పత్తి అన్​లోడ్​ చేసి వస్తున్న ట్రాక్టర్​ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హరిశంకర్​గౌడ్​అక్కడికక్కడే మృతిచెందాడు.  కాగా మృతుడి కుటుంబసభ్యులు మొదట హరిశంకర్ గౌడ్​ది హత్య అని భావించారు. కానీ పోలీసులు విచారణలో రోడ్డు ప్రమాదంగా తేల్చారు.