బర్త్ డే రోజు బైక్ పై వెళ్తూ చనిపోయిండు

బర్త్ డే రోజు బైక్ పై వెళ్తూ చనిపోయిండు

చేవెళ్ల , వెలుగు: ఒకే బైక్ పై ఫ్రెండ్స్ వెళ్తూ అదుపుతప్పి కిందపడడంతో ఓ యువకుడు చనిపోయిన ఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు  తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని గురుమిట్కల్ మండలం చేంద్రి గ్రామానికి చెందిన మొండిని రాఘవేంద్ర(18) తన బర్త్ డే సందర్భంగా ఇద్దరు ఫ్రెండ్స్ తో బైక్ (ఏపీ28 సీసీ 5656) పై మొయినాబాద్ వెళ్తూ.. వికారాబాద్ జిల్లా పరిగిలో మరో ఇద్దరు ఫ్రెండ్స్ తో మొత్తం ఐదుగురు స్పీడ్ గా వెళ్తున్నారు.

మొయినాబాద్ టోల్‌‌‌‌ గేట్ సమీపంలో బైక్‌‌‌‌ అదుపుతప్పి కిందపడ్డారు.  బైక్ పెట్రోల్ ట్యాంక్‌‌‌‌పై కూర్చున్న రాఘవేంద్ర తీవ్రంగా గాయపడి స్పాట్ లోనే మృతి చెందాడు. మరో నలుగురికి గాయాలయ్యాయి. మృతుడి తండ్రి నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మొయినాబాద్ పోలీసులు తెలిపారు.