యూట్యూబ్​ కంటెంట్​ క్రియేటర్లతో దేశానికి మస్తు ఇన్​కం

యూట్యూబ్​ కంటెంట్​ క్రియేటర్లతో దేశానికి మస్తు ఇన్​కం

న్యూఢిల్లీ : దేశ ఆర్థికాభివృద్ధిలో యూట్యూబ్​ క్రియేటర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రతీ ఏడాది రూ.6,800 కోట్లు కంట్రిబ్యూట్​ చేయడంతో పాటు 7లక్షల ఉద్యోగాలు జనరేట్​ చేస్తున్నారు. ఇండియా జీడీపీ వృద్ధిరేటులో తమవంతు సహకారం అందిస్తున్నారు. ఈ విషయాన్ని అబ్జర్వర్​ రీసెర్చ్​ ఫౌండేషన్​ (ఓఆర్​ఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో యూట్యూబ్​ చీఫ్​ ప్రొడక్ట్​ ఆఫీసర్​ నీల్​ మోహన్​ వెల్లడించారు. ‘టెక్నాలజీ, ఇన్నోవేషన్​ అండ్​ సొసైటీ’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. యూ ట్యూబ్​ క్రియేటర్లతో మన దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతోందన్నారు. క్రియేటర్లకు యూట్యూబ్​ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నదని, సొంతంగా బిజినెస్​ చేసుకునేందుకు పరోక్షంగా సాయం చేస్తున్నదని వివరించారు. అలాగే ఆడియన్స్​ను కూడా పెంచుకునే అవకాశం ఇస్తోందన్నారు. యూట్యూబ్​ ప్లాట్​ఫాంపై అన్నిరకాల వ్యాపారాలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు.

యాడ్స్​తో ఫైనాన్షియల్​ హెల్ప్​
చిన్న చిన్న బిజినెస్​ ప్లాట్​ఫాంలో యాడ్స్​ ద్వారా యూట్యూబ్ ఫైనాన్షియల్​ హెల్ప్ చేస్తున్నదని నీల్​ మోహన్​ వివరించారు. దాదాపుగా ఇండియాలో మాట్లాడే అన్ని భాషల్లో యూట్యూబ్​ సేవలు అందుతున్నాయన్నారు. కంటెంట్​ క్రియేటర్లతో పాటు యూజర్లకు సురక్షితమైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఇండియా మొత్తంలో కంటెంట్​ క్రియేటర్స్​ ముందుగా ఎంచుకునేది యూట్యూబ్​ అని చెప్పారు. ఒక్క కంటెంట్​ క్రియేటర్​ కోట్లాది మందిని ప్రభావితం చేస్తాడని, అందుకే ప్రభుత్వం ఈ ప్లాట్​ఫాంపై ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకోవడం సహజమని వివరించారు. తప్పుడు సమాచారం వ్యాప్తి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కంటెంట్​ క్రియేటర్లు, ప్రభుత్వాలతో పాటు యూట్యూబ్​పై కూడా ఉంటుందని అభిప్రాయపడ్డారు. తమ ఒపీనియన్​ షేర్​ చేసుకునేందుకు యూట్యూబ్​ ఓ వేదిక అని చెప్పారు. ఫేక్​ న్యూస్ వ్యాప్తి, హింసను నిరోధించడంలో తమ విధానం స్పష్టంగా ఉందని తేల్చి చెప్పారు.