న్యూఢిల్లీ : దేశ ఆర్థికాభివృద్ధిలో యూట్యూబ్ క్రియేటర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రతీ ఏడాది రూ.6,800 కోట్లు కంట్రిబ్యూట్ చేయడంతో పాటు 7లక్షల ఉద్యోగాలు జనరేట్ చేస్తున్నారు. ఇండియా జీడీపీ వృద్ధిరేటులో తమవంతు సహకారం అందిస్తున్నారు. ఈ విషయాన్ని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఓఆర్ఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో యూట్యూబ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ నీల్ మోహన్ వెల్లడించారు. ‘టెక్నాలజీ, ఇన్నోవేషన్ అండ్ సొసైటీ’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. యూ ట్యూబ్ క్రియేటర్లతో మన దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతోందన్నారు. క్రియేటర్లకు యూట్యూబ్ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నదని, సొంతంగా బిజినెస్ చేసుకునేందుకు పరోక్షంగా సాయం చేస్తున్నదని వివరించారు. అలాగే ఆడియన్స్ను కూడా పెంచుకునే అవకాశం ఇస్తోందన్నారు. యూట్యూబ్ ప్లాట్ఫాంపై అన్నిరకాల వ్యాపారాలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు.
యాడ్స్తో ఫైనాన్షియల్ హెల్ప్
చిన్న చిన్న బిజినెస్ ప్లాట్ఫాంలో యాడ్స్ ద్వారా యూట్యూబ్ ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తున్నదని నీల్ మోహన్ వివరించారు. దాదాపుగా ఇండియాలో మాట్లాడే అన్ని భాషల్లో యూట్యూబ్ సేవలు అందుతున్నాయన్నారు. కంటెంట్ క్రియేటర్లతో పాటు యూజర్లకు సురక్షితమైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఇండియా మొత్తంలో కంటెంట్ క్రియేటర్స్ ముందుగా ఎంచుకునేది యూట్యూబ్ అని చెప్పారు. ఒక్క కంటెంట్ క్రియేటర్ కోట్లాది మందిని ప్రభావితం చేస్తాడని, అందుకే ప్రభుత్వం ఈ ప్లాట్ఫాంపై ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకోవడం సహజమని వివరించారు. తప్పుడు సమాచారం వ్యాప్తి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కంటెంట్ క్రియేటర్లు, ప్రభుత్వాలతో పాటు యూట్యూబ్పై కూడా ఉంటుందని అభిప్రాయపడ్డారు. తమ ఒపీనియన్ షేర్ చేసుకునేందుకు యూట్యూబ్ ఓ వేదిక అని చెప్పారు. ఫేక్ న్యూస్ వ్యాప్తి, హింసను నిరోధించడంలో తమ విధానం స్పష్టంగా ఉందని తేల్చి చెప్పారు.