
గండిపేట, వెలుగు: పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ ఓ యువతి ఫిర్యాదుతో యూ ట్యూబర్ హర్షసాయి పై నార్సింగి పీఎస్లో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం యూట్యూబ్లో పలు కార్యక్రమాలు చేస్తూ హర్షసాయి పాపులర్ అయ్యాడు. మెగా అనే సినిమాలో హీరోగా కూడా చేశాడు.
ఈ క్రమంలో తనను హర్ష సాయి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని, రూ. 2 కోట్ల డబ్బు తీసుకున్నాడని అతనిపై, అతని తండ్రిపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో హర్ష సాయిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.