యూట్యూబ్​తో మనోళ్ల సంపాదన రూ. 6,800 కోట్లు

యూట్యూబ్​తో మనోళ్ల సంపాదన రూ. 6,800 కోట్లు
  • మరింత పెరిగే ఛాన్స్​
  • కొత్త ఉద్యోగాలూ వస్తాయ్

న్యూఢిల్లీ: వీడియో షేరింగ్​ ప్లాట్​ఫామ్​ యూట్యూబ్​ కోసం కంటెంట్​ క్రియేట్​ చేసి మనోళ్లు ఏకంగా రూ. 6,800 కోట్లు సంపాదించారట. 2020 సంవత్సరంలో మన ఎకానమీకి ఈ ఆదాయం వచ్చిందని ఇండిపెండెంట్​ కన్సల్టింగ్​ కంపెనీ ఆక్స్​ఫర్డ్​ ఎకనమిక్స్​ రిపోర్టు వెల్లడించింది. మన దేశంలో యూట్యూబ్​ ప్రభావం ఎకనమిక్​, సొసైటీ, కల్చరల్​గా ఎలా ఉందనే అంశాలని ఈ కన్సల్టింగ్​ కంపెనీ స్టడీ చేసింది. మన జీడీపీకి రూ. 6,800 కోట్లు తేవడమే కాకుండా, 6,83,900 ఫుల్​ టైమ్​ ఈక్వవలెంట్​ జాబ్స్​ను కూడా యూట్యూబ్​ 2020 లో ఇవ్వగలిగిందని స్టడీ తేల్చింది. యూట్యూబ్​ ద్వారా వచ్చిన రెవెన్యూలో ఎడ్వర్టైజింగ్​ రెవెన్యూతో పాటు, సబ్​స్క్రిప్షన్స్​, ఇతర మార్గాలలో మానిటైజేషన్​ వంటి వాటినీ లెక్కలోకి తీసుకున్నట్లు ఈ కంపెనీ పేర్కొంది. అంతేకాదు, ఆఫ్​ప్లాట్​ఫామ్​ రెవెన్యూలు (అంటే ఫ్యాన్​ మీటప్స్, స్పాన్సర్​షిప్స్​వంటివి) కూడా ఉన్నాయని వివరించింది.

యూట్యూబ్​ ఎకనమిక్​ ఇంపాక్ట్​ రెండు రకాలుగా ఉందని, ఒకటి కంటెంట్​ క్రియేటర్లకు వచ్చిన లాభాలైతే (డైరెక్ట్​ ఇంపాక్ట్​), రెండోది, మొత్తం సప్లయ్​ చెయిన్​లో ఈ కంటెంట్​ క్రియేషన్​ కోసం చేసిన ఖర్చులు (ఇండైరెక్ట్​ ఇంపాక్ట్) అని ఆక్స్‌‌‌‌పర్డ్​ ఎకనమిక్స్​ రిపోర్టు తెలిపింది. కంటెంట్​ క్రియేటర్​ ఎకో సిస్టమ్​ క్రియేట్​ చేసిన ఉద్యోగుల జీతాలూ ఇందులో ఉన్నాయని పేర్కొంది. యూట్యూబ్​ ప్లాట్​ఫామ్​పై ఆదాయం రావడంతోపాటు, కంటెంట్​ క్రియేటర్లకు గ్లోబల్​గా ఫ్యాన్​ బేస్​ ఏర్పడుతోందని..దీంతో బ్రాండ్​ పార్ట్​నర్షిప్స్​, లైవ్​ పెర్​ఫార్మెన్స్​, ఇతర మార్గాలలోనూ సంపాదించే వీలు కలుగుతోందని ఈ సందర్భంగా యూట్యూబ్​ తెలిపింది. ఈ రెవెన్యూ మార్గాలు ఉద్యోగాలు క్రియేట్​ చేయడమే కాకుండా, సప్లయ్​ చెయిన్​లో మరిన్ని ఆర్థిక అవకాశాలనూ కలిగిస్తున్నాయని యూట్యూబ్​ పేర్కొంది. ఇండియాలో కంటెంట్​ క్రియేటర్​ ఎకానమీ మరింత ఎదిగే అవకాశం ఉందని యూట్యూబ్​ పార్ట్‌‌నర్షిప్స్​(ఆసియా–పసిఫిక్​) రీజినల్​ డైరెక్టర్​ అజయ్​ విద్యాసాగర్​ వెల్లడించారు. కొత్త ఉద్యోగాలు వస్తాయని, సంస్కృతిపైనా కంటెంట్​తన  ప్రభావం చూపించగలుగుతుందని అన్నారు. డిజిటల్​, సోషల్​ మీడియా కంపెనీలకు ఇండియా పెద్ద మార్కెట్టని, స్మార్ట్​ ఫోన్ల అమ్మకాలు పెరగడంతోపాటు డేటా చీప్​గా దొరకడంతో ఈ మార్కెట్​ పటిష్టంగా ఎదుగుతోందని విద్యాసాగర్​ చెప్పారు. సోషల్​ మీడియా యూజర్లు భారీ సంఖ్యలో పెరిగారని అన్నారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం కిందటేడాది మన దేశంలో 44.8 కోట్ల మంది యూట్యూబ్​ యూజర్లు ఉన్నారు.