
హైదరాబాద్- కరోనా విషయంలో దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్లు సీఎం కేసీఆర్ హ్యవహారిస్తున్నారని తెలిపారు వైఎస్ షర్మిల సోమవారం ఆమె ట్విట్టర్ వేదికగా కేసీఆర్ పై వరుస ట్వీట్లు వదిలారు. కరోనా వచ్చిన ఏడాదికైనా కేసీఆర్ సారు .. మేల్కొని, ఆదిలాబాద్, వరంగల్ లలో సూపర్ స్పెషాలిటీ హాస్పటల్స్ తక్షణమే నిర్మించాలని నిర్ణయం తీసుకోవడం సంతోషం అన్నారు. అలాగే రాష్ట్రంలో మిర్చి రైతుల ఇబ్బందులను కూడా కాస్త పట్టించుకోవాలని కోరుతున్నా అన్నారు షర్మిల. ఇప్పటికే రాష్ట్రంలోని మిర్చి మార్కెట్లు బంద్ చేసి 25 రోజులు దాటిపోతుందని.. మార్కెట్ లలో పంటను అమ్ముకోలేక, రైతులు తమ ఆర్థిక అవసరాల కోసం అడ్డికి పావుశేరుకు పంటలను దళారులకు అమ్ముకొంటున్నారని తెలిపారు. క్వింటల్ కు 4 నుంచి 5 వేలు నష్టపోయే పరిస్థితి ఉందని.. మిర్చి రైతులు మరింత నష్టపోక ముందే .. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోకముందే.. మిర్చి మార్కెట్లను తెరవాలని డిమాండ్ చేస్తున్నా అన్నారు. మిర్చి రైతులపై సీఎం కేసీఆర్ సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలంటూ ట్వీట్ చేశారు షర్మిల.