- పాలేరు నుంచి పోటీకి రెడీ అవుతున్న షర్మిల
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్టీపీ ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్లో పార్టీ విలీనంపై స్పందన రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పార్టీ చీఫ్ షర్మిల త్వరలో అధికారికంగా మీడియాకు వెల్లఈ విషయాన్ని డించనున్నారు.
ఈ నెల 12 నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు స్వీకరించనున్నారు. లోటస్ పాండ్ లోని పార్టీ ఆఫీస్లో అప్లికేషన్ ఇవ్వాలని షర్మిల చెప్పారు. పార్టీ మేనిఫెస్టోపై సోమవారం నేతలు పిట్టా రాంరెడ్డి, తుడి దేవేందర్ రెడ్డి, గడిపల్లి కవిత, సుజాత మంగీలాల్ సమావేశమై చర్చించారు. పాలేరు నుంచి షర్మిల పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు.