సీఎం జిల్లాలో ఇంకా 20 కరువు మండలాలా?

సీఎం జిల్లాలో ఇంకా 20 కరువు మండలాలా?

సీఎం కేసీఆర్ జిల్లా అని చెప్పుకునే మెదక్ జిల్లాలో ఇంకా 20 మండలాలు కరువు మండలాలుగా ఉండటం దారుణమన్నారు వైఎస్ షర్మిల. మెదక్ జిల్లా వైఎస్సార్ అభిమానులతో షర్మిల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆమె.. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కి భూములు ఇచ్చిన రైతులు ఇంకా ఆందోళన చేస్తున్నారన్నారు. ఒక్కొక్కరికి ఒక విధంగా పరిహారం ఎంటని ప్రశ్నించారు. పారిశ్రామిక ప్రాంతం పఠాన్ చేరులో కాలుష్యం కోరలు చాస్తుందన్నారు. ఉద్యోగం రాలేదని నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.  దళితుల దగ్గర భూములు గుంజుకుంటున్నారన్నారు. అవుటర్ రింగ్ రోడ్ తో మెదక్ జిల్లా రూపు రేఖలు మారిపోయాయన్నారు. వైఎస్సార్ కు మెదక్ అంటే ప్రత్యేకమైన అభిమానమని.. సీఎంగా ఉన్నప్పుడు నలుగురిని క్యాబినెట్ లోకి తీసుకున్నారన్నారు.