తెలంగాణ వచ్చాక కూడా అవే ఆత్మహత్యలు, అవే ఆర్తనాదాలు

తెలంగాణ వచ్చాక కూడా అవే ఆత్మహత్యలు, అవే ఆర్తనాదాలు

ఆత్మహత్యలు లేని తెలంగాణ అయినప్పుడే శ్రీకాంతాచారికి నిజమైన నివాళి అని అన్నారు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల. శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళి అర్పించిన ఆమె.. ఆత్మగౌరవ తెలంగాణలో బతుకులు బాగుపడుతాయని శ్రీకాంతాచారి  అగ్నికి ఆహుతి చేసుకుంటే..తెలంగాణ వచ్చాక కూడా అవే ఆత్మహత్యలు,అవే ఆర్తనాదాలు కనిపిస్తున్నాయన్నారు. తెలంగాణలో నిరంకుశ పాలన భరించలేక రైతులు,నిరుద్యోగులు ప్రాణాలు వదులుతూనే ఉన్నారన్నారు.