158వ రోజు కొనసాగుతోన్న షర్మిల పాదయాత్ర

158వ రోజు కొనసాగుతోన్న షర్మిల పాదయాత్ర

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో 158వ రోజు కొనసాగుతోంది. ఎల్లికట్ట  నైట్ క్యాంప్ నుంచి పాదయాత్ర ప్రారంభించిన ఆమె కొండుర్గ్ మండల పరిధిలోని అప్పారెడ్డి గూడ క్రాస్, శ్రీరంగాపూర్ స్టేజ్, పులుసు మామిడి గ్రామాల మీదుగా యాత్ర కొనసాగనుంది. కొండుర్గ్ మండల కేంద్రంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిరుద్యోగ నిరాహార దీక్ష చేస్తారు.నిరుద్యోగుల పక్షాన ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న లక్షా 91 వేల ఉద్యోగాలకు పూర్తి స్థాయిలో నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీక్ష అనంతరం లాల్ పహాడ్ గ్రామం మీదుగా  ప్రజా ప్రస్థానం యాత్ర కొనసాగనునుంది. 

షర్మిల పాదయాత్రకు అనూహ్య స్పందన వస్తోంది.  ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.