ప్రజల సమస్యలు వింటుంటే మనస్సు చలించిపోతుందన్నారు.. YSRTP అధ్యక్షురాలు షర్మిల. మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఆరోరోజు పాదయాత్ర ప్రారంభించారు. తుమ్మలూరు గ్రామంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు షర్మిల. కష్టాలు తీర్చేందుకు తానున్నానని హామీ ఇచ్చారు. బంగారు తెలంగాణాలో బడి పిల్లల టాయిలెట్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉందన్నారు. ఆడపిల్లలకు నాణ్యమైన టాయిలెట్ వసతి కల్పించలేని కేసీఆర్ కు.. సీఎం పదవి ఎందుకని ప్రశ్నించారు. పాలన చేతకాకపోతే పర్మినెంట్ గా ఫామ్ హౌస్ లనే పడుకో అంటూ ట్వీట్ చేశారు షర్మిల.
బంగారు తెలంగాణల..బడి పిల్లలు టాయిలెట్ పరిస్థితి ఇది.. సిగ్గు సిగ్గు..ఆడపిల్లలకు నాణ్యమైన టాయిలెట్ వసతి కల్పించలేని కేసీఆర్ ఎందుకయ్యా నీకు ముఖ్యమంత్రి పదవి..పరిపాలన చాతకాకపోతే పర్మినెంట్ గా ఫామ్ హౌస్ లనే పడుకో.. #PrajaPrasthanam #Day6 pic.twitter.com/G3HKgslfnI
— YS Sharmila (@realyssharmila) October 25, 2021