తెలంగాణ కోసం పోరాడిన వారికి వెన్నుపోటు మీ కానుకా..? : వైఎస్ షర్మిల

తెలంగాణ కోసం పోరాడిన వారికి వెన్నుపోటు మీ కానుకా..? : వైఎస్ షర్మిల

ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ పరిపాలన తీరుపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ  అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరవీరుల స్థూపాన్ని నిర్మించిన 85 సంవత్సరాల వయసు గల యాదగిరి రావు బిల్లును ఇప్పటికీ క్లియర్ చేయలేదంటూ వ్యాఖ్యానించారు. 

అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తవుతున్నా.. యాదగిరి రావుకు బిల్లును చెల్లించలేరా..? అని ట్విట్టర్ లో వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ‘‘కమీషన్ల కక్కుర్తితో సిసలైన తెలంగాణ వాదాన్ని, పోరాట పటిమను, నేర్పును అవమానిస్తారా..? అసలైన తెలంగాణ వాదం మీ అవినీతి పాలన చెరలో ఉంటే, మోసగాళ్లు, బంధిపోట్లు గద్దెనెక్కి రాష్ట్రాన్ని పీక్కుతింటున్నారు’’ అంటూ ట్వీట్ లో వైఎస్ షర్మిల పేర్కొన్నారు. 

https://twitter.com/realyssharmila/status/1666018334159306752