కేసీఆర్కు షర్మిల గిఫ్ట్..పదేండ్ల మోసానికి ప్రజలిచ్చే తీర్పు అని వ్యాఖ్య

 కేసీఆర్కు షర్మిల గిఫ్ట్..పదేండ్ల మోసానికి ప్రజలిచ్చే తీర్పు అని వ్యాఖ్య
  • ప్యాకప్ టైమొచ్చింది
  • ఎగ్జిట్ పోల్ ఎగ్జాక్ట్​కావాలి
  • పదేండ్ల మోసానికి ప్రజలిచ్చే తీర్పు అని వ్యాఖ్య

హైదరాబాద్:వైఎస్సార్టీపీ చీఫ్​షర్మిల సీఎం కేసీఆర్ కు గిఫ్ట్ పంపారు. ‘తెలంగాణ ప్రజ‌లు చెబుతున్నారు...బైబై కేసీఆర్’ అని రాసిన లగేజ్ బాక్స్‌ను కానుకగా పంపిం చారు. లోటస్ పాండ్ లోని తన పార్టీ ఆఫీస్ లో ఏర్పాటుచేసిన ప్రెస్​మీట్ లో ఆమె మాట్లాడారు.

‘తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వివిధ సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్​కావాలి. కేసీఆర్​పదేండ్ల మోసానికి తెలంగాణ ప్రజలిచ్చే తీర్పు ఇది.  రేపటి దినం ఇంకో విమోచనదినం కావాలి. కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేసి వెన్ను పోటు పొడిచారు. ఆయన అసమర్థ సీఎం అని పోల్స్ చెబుతున్నాయి. మేము పార్టీ పెట్టినప్పటి నుంచి కేసీఆర్​అవినీతిని ఎత్తిచూపుతున్నం.

తెలంగాణ ప్రజల కోసమే మాపార్టీ పోటీ నుంచి విరమించుకుంది. సొంత పార్టీ వారు నన్ను దూషించారు. కేసీఆర్ కి ఎండ్ కార్డు పడనుంది.. ఆయనకు ప్యాకప్ చెప్పే టైం వచ్చింది’ అని అన్నారు. అయితే గతంలో ప్రగతిభవన్​నుంచి బయటకి రావాలని బూట్లు, అకాల వర్షాల సందర్భంగా పాడైన పంటను ట్రక్కులో కేసీఆర్​కు గిఫ్ట్​కు పంపించిన సంగతి తెలిసిందే.