అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లే.. తెలంగాణ ఏర్పాటు

అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లే.. తెలంగాణ ఏర్పాటు

హైదరాబాద్: రాజ్యాంగాన్ని మార్చడంలో తప్పేంటన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై వైఎస్సార్ టీపీ మండిపడింది. రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పడం అవివేకమని, అహంకారమని దుయ్యబట్టింది. ‘అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం వల్లే తెలంగాణ ఏర్పాటు అయింది. రాజ్యాంగాన్ని మార్చడం కేసీఆర్ తరం కాదు. మన రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్పది’ అని వైఎస్సార్ టీపీ ట్వీట్ చేసింది. సమస్యలపై గళమెత్తాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు అధినేత్రి షర్మిల పిలుపునిచ్చారని వైఎస్సార్ టీపీ మరో ట్వీట్ చేసింది. ప్రతిఒక్కరూ వైఎస్సార్ బిడ్డల్లా పని చేయాలని.. ఎప్పుడూ ప్రజలకు అండగా నిలబడాలని షర్మిల ఆదేశించారని పేర్కొంది. 

మరిన్ని వార్తల కోసం:

‘రాధేశ్యామ్’ వాలెంటైన్ గ్లింప్స్ వచ్చేసింది

అవినీతి గురించి మోడీ మాట్లాడరేం?

భర్త నుంచి విడిపోయిన మరో నటి