టీడీపీ సీనియర్ నేతకు గుండెపోటు

టీడీపీ సీనియర్ నేతకు గుండెపోటు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుండెపోటుకు గురయ్యారు. మాజీ ఎమ్మెల్సీ, టీడీపి సీనియర్ నేత వైవీబీ రాజేంద్రప్రసాద్ కు గుండెపోటు వచ్చింది. దీంతో వెంటనే ఆయన్ను కుటుంబ సభ్యులు విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైవీబీ రాజేంద్రప్రసాద్ కు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఎలాంటి ప్రాణాపాయం లేదని..యాంజియోగ్రామ్ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని డాక్టర్లు తెలిపారు. 

రాజేంద్రప్రసాద్కు గుండెపోటు వచ్చిందన్న వార్త తెలిసి టిడిపి అధినేత చంద్రబాబు దిగ్ర్భాంతికి గురయ్యారు. రాజేంద్రప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 

బాబు రాజేంద్ర ప్రసాద్ గుండె పోటుకు గురైనట్లు తెలిసిన వెంటనే టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నారు.  బాబూ రాజేంద్ర ప్రసాద్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.